అనంతపురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ జైల్ భరో

అనంతపురం 30 ఆగస్టు 2013:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు అనంతపురం జిల్లావ్యాప్తంగా మద్దతు లభించింది. పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష శుక్రవారం కూడా కొనసాగుతోంది. కళ్యాణదుర్గంలో గంధ్రాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్ ఎమ్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరింది. తాడిపత్రిలో పార్టీ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి దీక్ష 5వ రోజు, చొవ్వ రాజశేఖరరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, భాస్కరరెడ్డితో పాటు మైనారిటీ నేతలు చేపట్టిన దీక్ష 3 రోజుకు చేరాయి.  అనంతపురంలో వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతోంది.

Back to Top