ప్రతి తెలుగింట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని

 హైదరాబాద్‌:  శ్రీవిళంబి నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ వైయస్‌ జగన్‌ శ్రీవిళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ తెలుగు సంవత్సరంలో సకాలంలో వానలు పడి..రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. పాడి పంటలతో రైతులు వర్ధిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అభివృద్ధి ఫలాలను మెండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని వైయస్‌ జగన్‌ అభిలాషించారు.
 

తాజా వీడియోలు

Back to Top