<p style="text-align:justify">హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో సుమలత అనే ఆరోగ్య మిత్ర కార్యకర్త ఆత్మహత్య యత్నం చేసిన ఘటన మీద ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భర్త తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుంటే కుటుంబ పోషణ కోసం సుమలత అనే మహిళ ఆరోగ్య మిత్రగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తీసేస్తున్న ఉద్యోగుల జాబితాలో ఆమె కూడా ఉన్నారు. కుటుంబం రోడ్డున పడుతుందన్న బాధతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ఆమె ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకొని వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చెందారని, ఆత్మహత్యలకు పాల్పడకుండా పోరాటం ద్వారా సాధించుకోవాలని పిలుపు ఇచ్చారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. </p>