మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మీడియాతో వైయస్ జగన్ చిట్ చాట్
20 Mar 2017 3:57 PM
అమరావతిః ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తాను నీతివంతుడినంటూ నీతులు వల్లించడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కొనుగోళ్లు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరిని బెదిరించి, మరికొందరిని ప్రలోభపెట్టి బాబు నీచ స్థాయికి దిగజారారని ధ్వజమెత్తారు. ఒక్కో ఎంపీటీసీ, జడ్పీటీసీకి 20నుంచి 20 లక్షలు ఇచ్చారని విమర్శించారు. కోట్లు వెచ్చించి మేమే గెలిచామని బాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అలా గెలవడం ప్రజల అభిప్రాయమా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజల్లోకి ఏం సందేశం పంపుతున్నారని బాబుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ఓ గెలుపు అనుకుంటే పార్టీ మారిన 21మందిపై అనర్హత వేటు వేసి ఉపఎన్నికలకు రావాలని వైయస్ జగన్ బాబుకు సవాల్ విసిరారు. వాళ్లను మళ్లీ పోటికి పెడితే దాన్ని మేం రెఫరెండంగా స్వీకరిస్తామని చెప్పారు.