కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
'తుపాను' సీఎం కిరణ్ ఎక్కడకి వెళ్లారు?
17 Dec 2013 11:51 AM
హైదరాబాద్ :
ఫైలీన్ తుపానును ఆపలేను గానీ విభజన తుపానును ఆపుతానంటూ ప్రగల్భాలు పలికిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన కీలక సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన రాష్ట్ర విభజన తుపాను ఆపుతానని గతంలో ప్రకటించిన సీఎం ఇప్పుడు తప్పించుకుని తిరిగేందుకు యత్నించడం వెనుక కారణం ఏమిటని శ్రీకాంత్రెడ్డి నిలదీశారు.
'బిల్లు వస్తే దాని సంగతి తేలుస్తామన్నారు. సీఎం ఎక్కడకు వెళ్లి దాక్కున్నారో.. పోలీసులు విచారణ చేయాలి. తెలుగువారి ఆక్రోశాన్ని సీఎం, చంద్రబాబు తాకట్టు పెట్టారు' అని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పరిణామాలు వస్తాయనే అసెంబ్లీ పెట్టి సమైక్య తీర్మానం చేయమని తాము అన్నామని, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లే సీఎం నాటకం ఆడారన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ సాంకేతికంగా ప్రారంభం కాలేదని తమ అభిప్రాయమని శ్రీకాంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో భయపడినట్లుగానే సీఎం, చంద్రబాబులు వ్యవహరించారన్నారు.