మహనీయ నిన్ను మరువలేము

ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్సార్
పుష్కరాల్లో మహానేతకు పిండప్రదానం

అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో  చిరస్మరణీయుడిగా ఉన్నారు. ప్రతీ ఒక్కరూ ఆ మహానేతను  తమ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. కృష్ణాపుష్కరాల సందర్భంగా అనేకమంది వైయస్సార్ కు పిండ ప్రదానం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన 45 మంది వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, కొందరు యువకులు సీతానగరం ఘాట్ లో వైయస్సార్ కు పిండప్రదానం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరినీ వైయస్ ఆదుకున్నారన్నారు. ఆయన మరణం తరువాత రాష్ట్రం అవస్థల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ రాష్ట్ర యువజన సభ్యులు మూర్తాల ఉమామహేశ్వరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఓర్సు కాశయ్య, తిరుపతిరెడ్డి, గుండా కిషోర్, సర్పంచ్ గుర్రాల రాజు, ఉప సర్పంచ్ ఏలూరు సత్యనారాయణ, ఎంపీటీసీలు ఉమ్మా రామాంజనేయరెడ్డి, జి.పద్మజానాథ్‌రెడ్డి, బీసీ సెల్ మండల కన్వీనర్ తిరుపతిరావు, చెవిరెడ్డి ఏరువ, పమ్మి సీతారామిరెడ్డి తదితరులు ఉన్నారు.
Back to Top