రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విశాఖలో వైయస్ఆర్సిపి 'మహిళ' మానవహారం
25 Dec 2012 6:29 PM
విశాఖపట్నం, 25 డిసెంబర్ 2012: ఢిల్లీలో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మహిళలను కించపరిచే రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జగదాంబ సెంటర్లో పార్టీ మహిళా విభాగం నాయకులు, శ్రేణులు మంగళవారంనాడు మానవహారం నిర్వహించారు. అనంతరం బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మను నిరసనకారులు దగ్ధం చేశారు. 'అర్ధరాత్రి పూట మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కదా అని ఆ సమయంలో మనం తిరుగుతామా?' అంటూ బొత్స ఢిల్లీ అత్యాచార ఘటనపై వ్యాఖ్యానించడంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.