రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
అల్టిమేటమ్ ఇవ్వగలరా..!
16 Mar 2016 2:14 PM
హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాలుకల వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్
జగన్ అసెంబ్లీ వేదికగా కుండ బద్దలు కొట్టారు. ప్రత్యేక హోదా మరియు విభజన చట్టం
హామీల అమలు మీద శాసనసభలో తీర్మానం చేసిన సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఇక్కడ
బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు, అక్కడ మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారని
ఎండగట్టారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన
వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్న వేస్తున్నామని,
తీర్మానం వరకు బాగానే ఉందని చెబుతూనే, ప్రభుత్వం చేయవలసిన పనిని దిశానిర్దేశం
చేశారు. ‘‘నెల రోజులు గడువు ఇస్తాం. మీరు హామీలన్నీ అమలు చేయండి లేకపోతే కేంద్రం
నుంచి మా మంత్రుల్ని వెనక్కి తీసుకొంటాం ’’ అని అల్టిమేటమ్ ఇవ్వగలరా అని వైఎస్ జగన్
నిలదీశారు. రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నామని, అక్కడ నుంచి మాత్రం సరైన స్పందన
కనిపించటం లేదని పేర్కొన్నారు. దీని మీద అధికార పక్షం పెడర్థాలు తీస్తూ వెళ్లింది.
దీంతో పాటు తీర్మానం ప్రతిలో వెనుకబడిన జిల్లాలను ప్రస్తావించారని, ఇందులో రాయలసీమ
జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా ను కూడా కలపాలని కోరారు.