బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యం
పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
23 Oct 2017 10:59 AM
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకూ విశ్రమించమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ పేర్కొంది. పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ఓ సమావేశం నిర్వహించింది. పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు టి.ఎస్.విజయచందర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్దసారధి మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పథకాలను, నవరత్నాలను ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ ప్రచార కమిటీపై ఉందన్నారు.
పత్రికలు, చానళ్ల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేపట్టాలని సూచించారు. పార్టీ పటిష్టతకు కూడా ప్రచార కమిటీ పాటుపడాలన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ....వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రచార కమిటీలపై గురుతర భాద్యత ఉందని అది గుర్తుంచుకుని నేతలు పని చేయాలని కోరారు. పార్టీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పార్టీని, పార్టీ విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లడం అనేది ప్రచార కమిటీ పనితీరుపై ఆధారపడి ఉంటుందని అన్నారు.