సుప్రీంకోర్టును ఆశ్రయించిన రోజా

ఢిల్లీః హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించాలని చీఫ్ జస్టిస్ ఎదుట రోజా తరపు న్యాయవాది వాదించారు. వచ్చే శుక్రవారం రోజా పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రూల్స్ కు విరుద్ధంగా రోజాను ఏడాది పాటు ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రోజా కోర్టులో న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.

Back to Top