వధూవరులను ఆశీర్వదించిన శంకర నారాయణ

గోరంట్ల(సోమందేపల్లి): మండలంలోని ఎర్రయ్యగారిపల్లి గ్రామానికి చెందిన వైయస్సార్‌సీపి నాయకులు వెంకటరంగారెడ్డి కుమారుడు రాకేష్‌రెడ్డి కుమారుడి వివాహానికి వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ఫకృద్దిన్, నాయకులు గంపల రమణారెడ్డి, పాటూరి శంకరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, రమణారెడ్డి, కొండలరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Back to Top