శనివారంనాటి యాత్ర 11 కి.మీ.

ఖమ్మం, 10 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారానికి 145వ రోజుకు చేరుతుంది. క్రిష్టారం గ్రామం నుంచి శ్రీమతి షర్మిల యాత్ర ప్రారంభిస్తారు. వెంగళరావునగర్‌లో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సత్తుపల్లిలో చేరతారు. అక్కడ బస్సు స్టాండు సెంటర్లో బహిరంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు. శనివారం ఆమె మొత్తం 11 కిలోమీటర్లు నడుస్తారు.

Back to Top