ప్రత్యేకహోదా కోసం నిరసన మార్చ్..!

విజయవాడః ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపుమేరకు  ఇవాళ విజయవాడలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన మార్చ్ తలపెట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు ఈకార్యక్రమం కొనసాగనుంది. 

నిరసన మార్చ్ లో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, మాజీనేతలతో పాటు  కార్యకర్తలు నిరసన మార్చ్ లో పాల్గొంటారు. 


Back to Top