ప్రజ(పా)లమూరు

ఊళ్లన్నీ ఏకమయ్యాయి.. అడుగులన్నీ ఒక్కటయ్యాయి.. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో శ్రీమతి వైయస్ షర్మిల వెంట కదం కదిపాయి.. పోటెత్తిన జనంతో పాలమూరు వీధులన్నీ జనసాగరంగా మారాయి. నీరా‘జనం’లో క్లాక్‌ టవర్ సర్కిల్ కిక్కిరిసిపోయింది. తమ అభిమాన నేత దివంగత మహానేత వైయస్ కుమార్తెను కళ్లారాచూసి మురిసిపోయారు. రైతుల కష్టాలు..వలస బతుకుల కన్నీళ్లు ప్రస్తావించినప్పుడు.. జగనన్న వస్తాడనీ..సమస్యలు తీరుస్తాడనీ భరోసా ఇచ్చినప్పుడు..జయజయధ్వానాలు పలికారు.

మహబూబ్‌నగర్:

వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం నాడు ధర్మాపూర్ గ్రామం నుంచి మహబూబ్‌నగర్ పట్ట ణం వరకు సాగింది. ఈ సందర్భంగా స్థానిక క్లాక్ టవర్ సర్కిల్‌లో బహిరంగ సభ ఏర్పాటైంది. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టుకు జీవంపోసి రూ.10 కో ట్లు ఖర్చు చేస్తే మహబూబ్‌ నగర్ జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందనీ, ఈ ప్ర భుత్వం దానిని  పట్టించుకోలేదనీ షర్మిల ఆరోపించారు. పాలమూరు జిల్లా ప్రజల ఇబ్బందుల గురించి వైయస్ ఎప్పుడూ చెబుతుండేవాడని గుర్తు చేశారు.

వలసలపై ఆవేదన
     స్థానికంగా పనుల్లేక ఈ ప్రాంతవాసులు లక్షలాదిమంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన  వ్యక్తంచేశారు. స్థానికంగా పనులు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలో రూ. ఏడు కోట్ల వ్యయంతో నెట్టెంపాడు, కల్వకుర్తి, రాజీవ్‌ భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. జిల్లాలో ఏ రైతును కదిలించినా అప్పుల్లో కూరుకుపోయి బాధపడుతున్నామని చెప్పారన్నారు. ప్రభుత్వం అటువంటి వారిని ఆదుకోవడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాయితీ విత్తనాలు, ఎరువులు, పంటనష్ట పరిహారం అం దక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

జిల్లా అభివృద్ధికి వైయస్ కృషి
     మహబూబ్‌నగర్ పట్టణ వాసులకు తాగునీటి సమస్యను తీర్చేందుకు 2006లో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రామన్‌పాడు పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకుచర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆనీళ్లు సరిపోకపోవడంతో మరో రూ.100కోట్లు ఖర్చుచేసి కోయిల్‌సాగర్ నుంచి నీటిని తెచ్చేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కేవలం రూ.20కోట్లు ఖర్చుచేస్తే పట్టణంలో తాగునీటి సమస్య తీరేందుకు అవకాశమున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో అక్షరాస్యత పెంచి విద్యావంతులను చేయాలనే సంకల్పంతో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్శిటీని నెలకొల్పారని, దీంతో అక్కడ దాదాపు 600 మంది విద్యార్థులు పీజీ వరకు చదువుకునే అవకాశం కలిగిందని గుర్తుచేశారు.

గెలిచిన అనంతరం జాడలేని కేసీఆర్!
     మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కేసీఆర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి రావడమే మానేశారని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఇలాంటి వా రికి తగిన బుద్ధిచెప్పాల్సిన అవసరముందన్నా రు. జగనన్నను ఆశీర్వదిస్తే డాక్టర్ వైయస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు కూడా తిరిగి ప్రా ణం పోసుకుంటాయని హామీ ఇచ్చారు. వ్యవసాయం చేయడమే దండగ అన్న చంద్రబాబునాయుడు పాదయాత్ర చేస్తూ రైతన్నలను ఆదుకుంటానని మోసపూరిత ప్రకటనలు చేస్తున్నార ని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయపబ్బం గడుపుతున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

Back to Top