చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
'ప్రాణహిత'ను సందర్శించనున్న విజయమ్మ
20 May 2013 5:04 PM
కాగజ్నగర్, 20 మే 2013:
ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం సందర్శించారు. పరిశీలించిన వారిలో బాజిరెడ్డి గోవర్ధన్, ఎ. ఇంద్రకరణ్రెడ్డి, జనక్ప్రసాద్, బోడ జనార్దన్, సోయం బాపురావు, తూల శ్రీనివాస్ ఉన్నారు. ఈ శిలాఫలకానికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సతీమణి శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం క్షీరాభిషేకం చేయనున్నారు. అనంతరం ఎస్పీఎం క్రికెట్ మైదానంలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. ఈ బహిరంగ సభలోనే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీలో చేరతారు.