కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
మహా శివరాత్రి సందర్భంగా పొంగులేటి పూజలు
18 Feb 2015 4:08 PM
ఖమ్మం: మహా శివరాత్రి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలోని పలు శైవక్షేత్రాల్లో పూజలు నిర్వహించారు. తొలుత కూసుమంచిలోని గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం నగర శివారు ధంసలాపురంలోని శివాలయంలో అభిషేక పూజలు చేసి గ్రామంలోని గోశాలను సందర్శించారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని లింగేశ్వరస్వామి ఆలయం, కల్లూరు కనకగిరి శివాలయం, కాశ్మీర మహాదేవ క్షేత్రం, వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించి జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. పొంగులేటి రాఘవరెడ్డి-స్వరాజ్యం ట్రస్టు ఆధ్వర్యంలో కల్లూరు శివాలయంలో నిర్మించిన కోనేరును ఎంపీ సందర్శించారు. ఖమ్మం, కల్లూరులో బ్రహ్మకుమారిలు ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాల కార్యక్రమంలో ఎంపీ పూజలు చేశారు.