<strong>వైయస్ఆర్ జిల్లాః</strong> వైయస్సార్సీపీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి. ప్రజలు, వివిధ పార్టీల నాయకులు వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. ప్రభుత్వ మోసపూరిత విధానాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తూ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న వైయస్ జగన్ వెంట నడిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా సమక్షంలో 100 మందికి పైగా వైయస్సార్సీపీలో చేరారు. అంజాద్ బాషా వీరికి పార్టీ కండువాలు కప్పిసాదరంగా ఆహ్వానించారు. <br/>