వైయస్ఆర్‌ వారసత్వం ఇంకెవ్వరికీ లేదు

హైదరాబాద్:

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి వారసత్వం ‌ఆయన తనయుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఒక్కరికే సొంతమని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌ అన్నారు. ఆయన వారసత్వం మరెవ్వరికీ లేదన్నారు. మహానేత వైయస్ఆర్ పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం చే‌స్తున్న దామోదర రాజనర్శింహను ప్రజలు నమ్మబోరని సూర్యప్రకాశ్ అన్నారు. ‘తెలంగాణకు నేనే సీఎం అంటూ తిరుగుతున్న దామోదర రాజనర్శింహ ఏనాటికీ వైయస్ఆర్ వారసుడు కాలే‌రన్నారు. ఓట్ల కోసం చేసే ఇలాంటి చౌకబారు ఎత్తుగడలను జనం ఛీ కొడతారు’ అని పేర్కొన్నారు. వైయస్ఆర్ సేవలు ఎనలేనివని, మళ్లీ ఆ శక్తి సామర్థ్యాలు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరికే ఉన్నాయన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారంనాడు నల్లా సూర్యప్రకాశ్ ‌మీడియాతో మాట్లాడారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఇటీవల ఓ కార్యక్రమంలో వైయస్ఆర్ తన గురువు అని, ఆయన అడుగు జాడల్లోనే నడుస్తానని, మాట తప్పను, మడమ తిప్పనని చెప్పుకోవడం సిగ్గుచే‌టు అని నల్లా నిప్పులు చెరిగారు. ఓట్ల కోసమే దామోదర ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌పై అంత అభిమానం ఉంటే ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పుడు, సీబీఐకి చెందిన 20 బృందాలు ఒకేసారి ఆయన కుటుంబంపై దాడులకు దిగినప్పుడు దామోదర ఎందుకు చూస్తూ ఉండిపోయారని నిలదీశారు. అక్రమ కేసులు బనాయించి శ్రీ జగన్‌ను 16 నెలలు జైల్లో పెడితే ఎందుకు నోరెత్తలేదని దామోదర రాజనర్శింహను నల్లా ప్రశ్నించారు.

Back to Top