నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా..

అనంతపురం:

మహానేత వైఎస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం ముద్దలాపురం నుంచి ప్రారంభమవుతుంది. వైయస్ఆర్ వాటర్ ప్రాజెక్టు, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేట మీదుగా భంభంస్వామి గుట్ట వరకు సాగుతుందని పార్టీ కార్యక్రమా సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం. శంకరనారాయణ వెల్లడించారు. గురువారం భంభంస్వామి గుట్ట వద్దే షర్మిల రాత్రి బస చేస్తారు. మొత్తం 13 కిలోమీటర్లు నడుస్తారని చెప్పారు. జల్లిపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. శుక్రవారం భంభం స్వామి గుట్ట నుంచి ప్రారంభమై పెన్నహోబిలం, పీఏబీఆర్ కాలువ, కోనాపురం క్రాస్, కోనాపురం మీదుగా సాగుతుంది. షెక్షాన్‌పల్లిలో బహిరంగ సభ ఉంటుంది. అనంతరం లత్తవరం సమీపంలో రాత్రి బస చేస్తారు. ఆ రోజు మొత్తం 12.5 కిలోమీటర్లు నడుస్తారని పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

Back to Top