హైదరాబాద్: మాకు ప్రత్యేక హోదానే సంజీవని అని మా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని, అంశాల వారిగానే బీజేపీకి సహకరిస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి వివరించారు. ప్రత్యేక హోదా ఎవరిస్తే ఆ పార్టీకే సహకరిస్తామని ఆయన చెప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని, ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని రాచమల్లు హితవు పలికారు.