కర్నూలు: పాణ్యం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బైరెడ్డి రాజశేఖరరెడ్డికి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం బైరెడ్డి తమ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 ఓట్లు రాని బైరెడ్డి నా గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. హత్యా రాజకీయాలు బైరెడ్డికి వెన్నుతో పెట్టిన విద్య అని విమర్శించారు.