ఆరోగ్యమిత్ర ఉద్యోగులపై దౌర్జన్యం

విజయవాడ: న్యాయం కోసం అడిగిన ఆరోగ్యమిత్ర ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం లాఠీలతో జవాబిచ్చింది. ఉద్యోగాల్లోంచి తొలగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆరోగ్య మిత్ర ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని  తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా బయలు దేరారు. దీంతో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే పోలీసులకు లాఠీలతో నెట్టివేశారు. బలవంతంగా ఉద్యోగుల్ని వాహనాల్లోకి ఎక్కించి అదుపులోకి తీసుకొన్నారు.
Back to Top