పశ్చిమగోదావరిః వైయస్ జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దెందులూరు కన్వీనర్ కొటారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో పెదవేగి మండలం కవ్వగుంట నుంచి లక్ష్మీపురం మీదగా వంగూరు వరుకు గ్రామస్తుల పాదయాత్ర నిర్వహించారు. జగనన్న వస్తేనే రాష్ట్ర్రానికి మంచి రోజులు వస్తాయని గ్రామస్తులు తెలిపారు. అనంతరం రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి నవరత్నాలపై అవగాహన కల్పించారు.