బనగానపల్లె(జిల్లెల్ల): గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మాధవరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ ప్రజల వంచన పార్టీగా తయారైందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఓ ఒక్క హామీ నెరవేర్చలేదని, 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. వైయస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.