జననేత నాయకత్వంలోనే సమస్యలు పరిష్కారం..

విజయనగరంః చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలనే కులవృత్తుల వారు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత చంద్రశేఖర్‌ తెలిపారు.వైయస్‌ జగన్‌ నాయకత్వంలో తోటపల్లి  ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. తాగునీరు కూడా లేని పిరిస్థితి చీపురుపల్లి,గజపతినగరం నియోజకవర్గాల్లో ఉందన్నారు. జననేతకు తమ సమస్యలు చెప్పుకుంటే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వైయస్‌ జగన్‌కు  ప్రజలు పెద్దఎత్తున బ్రహ్మరథం పడుతున్నారన్నారు
Back to Top