జన్మదిన శుభాకాంక్షలు: జగన్



హైదరాబాద్: విశాఖపట్టణం పెందుర్తిలోని శ్రీ శారద పీఠాధిపతి
శ్రీస్వామి స్వరూపానంద సరస్వతి జన్మదినం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
శుభాకాంక్షలు తెలిపారు.

విశాఖపట్నం లో శారద పీఠం నిర్వహిస్తున్న శ్రీ స్వరూపాందేంద్ర సరస్వతి
ఆధ్యాత్మిక ప్రపంచంలో విశిష్టులుగా ఖ్యాతి నొందారు. హైందవ మత అభ్యున్నతికి ,
ఆధ్యాత్మిక ప్రాచుర్యం కోసం విశేష క్రషి చేస్తున్నారు. అద్వైత మార్గంలో శిష్యుల్ని
నడిపిస్తూ భక్తి మార్గంలో దిక్సూచిగా నిలుస్తున్నారు.

శారద పీఠం వార్షికోత్సవ సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆ పీఠాన్ని
సందర్శించారు. అప్పట్లో సింహాచలం లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ని జగన్ దర్శించుకొన్నారు.
అనంతరం శారద పీఠాన్ని సందర్శించి స్వామి ఆశీస్సులు తీసుకొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top