ఏపీ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించే నిర్ణయంపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీని కారణంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటారని అభిప్రాయ పడ్డారు. ''రాష్ట్రాలు విడిపోయినా మనది ఒకే భాష.మనం అందరం కలిసే ఉంటాం. రెండు రాష్ట్రాలూ ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదు'' అని వైఎస్ జగన్ అన్నారు.