వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
శ్రీకాళహస్తి ఆస్పత్రికి ఎంపీ ఫండ్స్
25 Feb 2017 3:25 PM
చిత్తూరుః వైయస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రోగుల ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా హాస్పిటల్ లో వసతులపై ఆరా తీశారు. హాస్పిటల్ లో బెడ్ షీట్స్, అంబులెన్స్, జనరేటర్ కొరత ఉందని తెలిపారు. హాస్పిటల్ లో కనీస వసతులపై సూపరిండెంట్ తో మాట్లాడనని, ఎంపీ నిధులను ఆస్పత్రికి కేటాయిస్తానని చెప్పారు. హాస్పిటల్ లో డయాలసిస్ భారీ ఎత్తున పెట్టినప్పటికీ ప్రైవేటు వారికి అప్పగించడం మూలాన అది మూతబడి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్స్ పేషెంట్స్ కి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కోరారు. ఆస్పత్రిని మరింతగా మెరుగపర్చడం కోసం జిల్లా మంత్రితో పాటు సంబంధిత హెల్త్ మినిస్టర్ తో మాట్లాడుతానని వరప్రసాద్ వారికి హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి ప్రజలకు మంచి జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.