వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌లో చేరిన మోపిదేవి అనుచరులు

హైదరాబాద్, 4 జూలై 2013:

మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ప్రధాన అనుచరుడు, తెనాలి రూరల్‌ మండలం మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు శాఖమూరు నారాయణ ప్రసాద్‌తో పాటు భూషణం, చిన్నయ్య, నాగమల్లేశ్వరరావు, వెంకటరావు, వీరయ్య మాజీ జడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యులు, మాజీ సర్పంచ్‌లు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని లోట‌స్‌పాండ్ లో‌ ఉన్న పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో వారు‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శ్రీమతి విజయమ్మ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

వాన్‌పిక్‌ కేసులో మోపిదేవి జైలుకు వెళ్లి ఏడాది అయింది. అయినా ఆయన విడుదల కోసం ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నించటంలేదు. దీనిలో మోపిదేవి సోదరుడు కాంగ్రెస్ ప్రభుత్వం‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలతో సహా రానున్న ప్రతి ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా నారాయణ ప్రసాద్‌ తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top