‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా తండ్రీకొడుకుల వ్యాఖ్యలు
27 Jul 2018 2:12 PM
హైదరాబాద్: చంద్రబాబు, లోకేష్ అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. నాలుగేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం అమలు చేయకుండా రూ. నాలుగున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిని ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేశామన్నారు. హైదరాబాద్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వరప్రసాదరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఒక్క మంచి కార్యక్రమమైనా చంద్రబాబు చేశారేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.