<strong>- రుణం మాఫీ కాక కర్నూలు జిలాల్లో రైతు దంపతుల ఆత్మహత్య</strong><strong>– బ్యాంక్ నుంచి నోటీసులు రావడంతో మనస్తాపం</strong><strong>- ఏపీలో ఆగని రైతు ఆత్మహత్యలు </strong>కర్నూలు: ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన రైతు దంపతులు రుణం మాఫీ కాక, బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. రుణమాఫీ జరగక బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో కర్నూలు జిల్లా ఆలూరులో రైతు వృద్ధ దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడులో దారుణం చోటుచేసుకుంది. రుణమాఫీ కాలేదని గ్రామానికి చెందిన రామయ్య దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో పాటు తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అప్పుతీర్చడానికి మరో మార్గం లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.<br/>గతంలో ఆ దంపతులు వ్యవసాయం కోసం ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకు నుంచి రూ. 1.46 లక్షల రుణం తీసుకున్నారు. అయితే 2016లో రుణ విమోచన పత్రాన్ని సైతం బ్యాంకు అధికారులు రామయ్యకు ఇచ్చారు. దాంతో ఏపీ ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ రుణమాఫీ కాకపోవడంతో పాటు పంటలు కూడా సరిగా పండకపోవడంతో ఆ రుణం వారికి భారంగా మారింది. మరొకవైపు బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడికి కూడా పెరిగిపోయింది. రుణం తీర్చాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరొకవైపు నోటీసు ఫీజు రూ. 290 కూడా కట్టాలంటూ బ్యాంకు అధికారులు పేర్కొనడం కూడా వారిని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. దాంతో కలత చెందిన రామయ్య దంపతులు బ్రతకడాన్ని భారంగా భావించి ఆత్మహత్య చేసుకున్నారు.<br/><strong>ఇది మూమ్మాటికి ప్రభుత్వ హత్యే..</strong>ఇది మూమ్మాటికి ప్రభుత్వ హత్యేనని టీడీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ కాకపోవడంతోనే రామయ్య దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమవడం వల్లే.. ఆత్మాభిమానం చంపుకోలేక వృద్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రైతులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందనీ, దయచేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.