చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ కుట్రలు చేసిందిజగన్ అన్నను బెదిరించారు..కేసులు పెట్టారుఎన్ని కష్టాలెదురైనా ఎదుర్కొన్నాంమా సంకల్పం చెక్కుచెదరలేదు. మా వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు<br/>నిజామాబాద్ః మహానేత రాజన్న తనయ జననేత వైఎస్ జగన్ సోదరి షర్మిల మొక్కవోని దీక్షతో పరామర్శయాత్రను పూర్తిచేశారు. ఎండనకా, వాననకా మహానేత కోసం అసువులు బాసిన కుటుంబాలకు అండగా నిలుస్తూ తన పరామర్శయాత్రను విజయవంతంగా ముగించారు. ఈసందర్భంగా తన జ్ఞాపకాలను, కష్టాలకడలిని మీడియాతో పంచుకున్నారు. ఉద్విగ్నభరితంగా పరామర్శయాత్ర ఘట్టాన్ని వివరించారు. <br/><strong>ప్రతి పథకంలోను ..</strong>దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను చేపట్టిన ప్రతి సంక్షేమ పథకంలో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఉచిత విద్యుత్ ద్వారా పండించే ప్రతి పంటలోనూ, పేదవాడికి సంజీవనిగా ఉండే ఆరోగ్యశ్రీలోనూ, పేదవిద్యార్థులకు వరంగా మారిన ఫీజు రీయింబర్స్ మెంట్ లోనూ, ఆపద కాలంలో ఆదుకున్న 108లోనూ, గిరిజనులు, హరిజనులకు తాను పంపిణీ చేసిన లక్షల ఎకరాల భూముల్లోనూ , తన హయంలో పేదలకు కట్టిన 48 లక్షల ఇళ్లలోనూ ఇలా ప్రతి పథకంలో రాజన్న బతికే ఉంటారు. అందుకే ఆమహానేత చనిపోయి ఆరేళ్లయినా ఆయన పథకాలను ఇప్పటకీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నారంటే అందుకు ప్రతి ఒక్కరూ ఒప్పుకోకతప్పదు. <br/><strong>రాజకీయ రంగు..</strong>తెలుగు జాతి బతికి ఉన్నంతవరకు తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పటికీ బతికే ఉంటారు. పావురాల గుట్టలో నాన్నమరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ అన్న మాట ఇచ్చాడు. కొడుకు హోదాలో ఇచ్చిన ఆ మాటకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ రంగు పూసింది. చనిపోయిన తమ వ్యక్తులను పరామర్శిస్తామని మా కుటుంబం స్వంయంగా వెళ్లి విజ్ఞప్తి చేసుకున్నా వీల్లేదన్నారు. బెదిరించారు. భయపెట్టారు. అయినా ఆకుటుంబాలను ఆదుకోవాలన్న మా సంకల్పం చెక్కుచెదరలేదు. <strong>ఎంత కష్టమైనా..</strong>కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలిసి కుట్రపూరితంగా కేసులు పెట్టారు. ఛార్జ్ షీట్లు వేశారు. జైల్లో పెట్టారు. ఈరోజుకు తిప్పుతున్నారు. అయినా పావురాల గుట్టలో జగన్ అన్న ఇచ్చిన మాటను మడమ తిప్పకుండా ఈరోజు నిలబెట్టుకున్నాం. ఎంత కష్టం, నష్టమొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సంతోషం మా సొంతం. మహానేత కోసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా వెతుక్కుంటూ వెళ్లాం. ఆ కుటుంబాలను పరామర్శించి వారి బాధను పంచుకున్నాం. త్యాగాన్ని గుర్తించాం. కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మేం వెళ్లిన ప్రతి వాడలో అందరూ ఆత్మీయ స్వాగతం పలికారు. వారందరికీ రాజన్న కుటుంబం కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.<br/><strong>ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు..</strong>ఓదార్పు యాత్రను, పరామర్శయాత్రను దిగ్విజయంగా పూర్తిచేయడానికి కారణమైన వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆఖరి పరామర్శయాత్రలో వైఎస్సార్ కోసం అసువులు బాసిన వారి స్మారకార్థం గాంధారి మండలం పోతంగల్ కలాన్ పల్లెలో ఎకరం భూమి తీసుకొని రాజన్న విగ్రహం పెట్టి నివాళులర్పించాం. ఇడుపులపాయలో ఎలాగైతే పైలాన్ పెట్టి వందలాది మంది చనిపోయిన వారి పేర్లు లిఖించామో అదే మాదిరి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం . రెండు ప్రాంతాల్లో పైలాన్ లు ఎప్పటికీ ఉంటాయి. చిరకాల దీపికగా ఉండాలని మాకోరిక అంటూ వైఎస్ షర్మిల తన ప్రసంగాన్ని ముగించారు.