వాళ్ళిద్దరూ దొంగలే : ఎమ్మెల్యే భూమన

తిరుపతి, 29 సెప్టెంబర్ 2013:

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ దొంగలే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ‌తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఆదివారం నిర్వహించిన ఆందోళనలో ఆయన ప్రసంగించారు. సిఎం కిరణ్ సమైక్యవాది అయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ‌భూమన డిమాండ్ చేశారు. పదవులకు రాజీనామా చేయకుండా తిరుగుతున్న సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులను అడ్డుకుని బు‌ద్ధి చెప్పాలని ఎమ్మెల్యే భూమన ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Back to Top