ప్రభుత్వ నిర్లక్ష్యంతో గడ్డుకాలం

రాజమండ్రి: వ్యవసాయ
రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్సీపీ రైతు
విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో గోదావరి డెల్టా
సంక్షోభంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ లో దిగుబడి 80లక్షల
నుంచి 50లక్షలకు పడిపోయిందని తెలిపారు.

పోలవరం
రాకుంటే ఖరీఫ్ లో ఒక్క ఎకరాకు నీరిచ్చే పరిస్థితి లేదన్నారు. రైతు సంఘాలతో
చంద్రబాబు మాట్లాడలేదు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఇప్పటి వరకు అమలు
చేయలేదని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో గోదావరి డెల్టాకు
దారుణమైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.  మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి
చాకచక్యంగా వ్యవహరించి ఒక్క ఎకరా ఎండిపోకుండా నీరిచ్చారు. అదే విధానాన్ని
బాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు అని నాగిరెడ్డి నిలదీశారు.
Back to Top