ముఖ్యమంత్రికి చుక్కెదురు

విజయనగరం:
జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రికి నిరసన సెగలు అంటుకున్నాయి.  విజయనగరం
జిల్లా బొండపల్లిలో జరిగిన మూడో విడత జన్మభూమి కార్యక్రమంలో  పాల్గొన్న
చంద్రబాబుకు రైతుల నుంచి  చుక్కెదురైంది. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలను
మభ్యపెట్టేందుకు  ప్రయత్నించిన చంద్రబాబు పప్పులు ఉడకలేదు. ఏ ఒక్క సమస్య
పరిష్కారం కాలేదంటూ సభకు హాజరైన రైతులు బాబును నిలదీశారు. 

ఎన్నికల్లో
ఇచ్చిన హామీలతో పాటు స్థానిక సమస్యలపై రైతులు ముఖ్యమంత్రిని నిలదీశారు.
 967 ఖాతాలకు సంబంధించి ఒకే ఒక్క బిల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వారు
ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు కొనుగోలు చేయడం లేదని, ఖరీఫ్ ధాన్యాన్ని
నేరుగా తమ వద్దకే వచ్చి కొనుగోలు చేయాలని రైతులు సీఎంను డిమాండ్ చేశారు. 
Back to Top