వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చంద్రబాబు అండదండలతో రాష్ట్రం లూటీ..
25 Nov 2018 2:54 PM
విజయనగరంః అగ్రిగోల్డ్ బాధితుడ్ని చెంపదెబ్బ కొట్టడం చంద్రబాబు అసహనానికి పరాకాష్ట అని వైయస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయం అడిగితే సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం వారి భౌతికంగా కొట్టడం అసమర్థతకు నిదర్శనమన్నారు.అధికార పార్టీ అవినీతిపై చాలా కాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు. బ్యాంకులకు రూ.ఆరు వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన సుజనా దోపిడీ టీడీపీ నేతల అవినీతికి చిన్న ఉదాహరణ మాత్రమే అన్నారు. ఇలాంటి సుజనాలు,సీఎం రమేష్ లాంటివాళ్లు చాలా మంది ఉన్నారన్నారు.టీడీపీ నేతలది మొత్తం నాలుగున్నర లక్షల కోట్ల అవినీతి అని అన్నారు.చంద్రబాబు వెనుక అనేకమంది సుజనాచౌదరీలు ఉన్నారన్నారు.బాబు అండదండలతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నారు.దొరకని దొంగలు బాబు వద్ద చాలా మందే ఉన్నారన్నారు.