పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
బొత్స కంచుకోటలో వైయస్ఆర్ సీపీ భేరి
10 Oct 2012 2:45 AM
విజయనగరం, 10 అక్టోబర్ 2012: పిసిసి అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కంచుకోటల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన లభిస్తోంది. పార్టీ సమీక్షా సమావేశాలకు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు. దీనితో పార్టీ పట్ల పలువురిలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
పార్టీ కార్యక్రమాల్లో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ విజయనగరం జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీకి చెంది జిల్లా నాయకులు పెన్మత్స సాంబశివరాజు, కుంభా రవిబాబుతో పాటు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు గజపతినగరంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశాల్లో నిర్ణయించుకుంటున్నామని పార్టీ నేతలు చెప్పారు.
బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నర్సయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావడం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.