వైయస్‌ఆర్‌సీపీలోకి బీజేపీ నేత ముద్దాడ మధు

విజయనగరం: వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బీజేపీ నేత  ముద్దాడ మధు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వైయస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ  జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనత ఆయన సాధించారన్నారు. వైయస్‌ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ అపూర్వమన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
Back to Top