పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ముఖ్యమంత్రి వైఖరిని నిలదీసిన భూమన
18 Jun 2013 3:10 PM
హైదరాబాద్ 18 జూన్ 2013:
ఒక్కొక్కొరికీ ఒక్కో న్యాయాన్ని పాటిస్తున్న ప్రభుత్వాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నిలదీశారు. మంత్రులకో న్యాయం, తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు ఏతప్పు చేయలేదని సీఎం అసెంబ్లీలోనే చెప్పారని, మంత్రులది తప్పుకాకుంటే శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిది తప్పెలా అవుతుందో వివరించాలన్నారు. క్విడ్ ప్రోకో జరగనపుడు శ్రీ వైయస్ జగన్ నేరస్తుడు, కుట్రదారుడు ఎలా అవుతారన్నారు. ఒక్క రోజు కూడా ప్రభుత్వ భాగస్వామిగా లేని శ్రీ జగన్ నేరస్తుడు ఎలా అవుతారని నిలదీశారు. చంద్రబాబుపై ఉన్న కుంభకోణాల సంగతి టీడీపీ నేతలు మరచిపోయారన్నారు. టీడీపీ ఓ పక్క ప్రభుత్వాన్ని కాపాడుతూ, మరో పక్క కళంకిత మంత్రులంటూ నాటకాలాడుతోందని భూమన ఎద్దేవా చేశారు.