చంద్రబాబు అభివృద్ధి పత్రికలకే పరిమితం

వైయస్‌ఆర్‌ జిల్లా:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం పబ్లిసిటీ పాలన సాగుతుందని రమణారెడ్డి అన్నారు. చంద్రబాబు చేసే అభివృద్ధి అంతా పత్రికలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. అందుకు వైయస్‌ జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణే నిదర్శనమన్నారు. 

Back to Top