'అంత దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదు'

కర్నూలు: చంద్రబాబుపై సీబీఐ విచారణ జరుగుతుందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కుమ్మక్కులో భాగమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలులో ఆమె బుధవారం కళానికేతన్ షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం శోభానాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై సీబీఐతో విచారణ చేయించేంత సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావటం ఖాయమన్నారు. బాబు ఓ పక్క పాదయాత్ర చేస్తుండగా మరోపక్కనుంచి కార్యకర్తలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారని అవహేళన చేశారు. పార్టీ నేతలకే నమ్మకం కలిగించని చంద్రబాబు ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారని ఆమె ప్రశ్నించారు.  

Back to Top