158వ రోజు యాత్ర 11.5కి.మీ

ఉండి, 24 మే 2013:

పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం 11.5 కిలోమీటర్లు సాగుతుంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారంనాడు 158వ రోజుకు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పరిధిలోని ఉదయం  ప్రారంభమయింది. కొండేపూడి అడ్డరోడ్డు, కోలమూరు, పాములపర్రు, ఉండి మీదుగా షర్మిల నడుస్తారు. ఈ సాయంత్రం ఉండిలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు.

Back to Top