జనం ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి

 విశాఖ‌: ప‌రిష‌త్ ఎన్నిక‌లకు బ్రేక్ ప‌డిందని టీడీపీ నేత‌లు సంబ‌రాలు చేసుకోవడంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి చుర‌క‌లంటించారు. ప‌రిష‌త్ ఎన్నిక‌‌ల‌కు  త‌త్కాలికంగా బ్రేక్ లు వేయించొచ్చు - అంతిమ విజయం మాత్రం న్యాయానిదే. నాయకుడు తేల్చుకోవాల్సింది ప్రజాకోర్టులోనే. చంకలు గుద్దుకుని తాత్కాలిక ఆనందం పొందితే - జనం ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు అంటూ విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

Back to Top