కోవిడ్ వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయాలి

 కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
 

  తిరుపతి:  కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం  కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎస్వీ వర్సిటీలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ నారాయణ గుప్తా, ఎస్పీ పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ వేగవంతం, పరీక్షలు, ఆక్సిజన్ ఏర్పాటుపై చర్చించారు.

Back to Top