సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
పంచారామాల దర్శనం కార్తీకమాసంలో ఎంతో పుణ్యం
09 Dec 2020 12:52 PM
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: కార్తీక మాసంలో పంచారామాల దర్శనంతో ఎంతో పుణ్యం లభిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ‘పంచారామస్’ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో తపాలా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్ట్ కార్డులను మంత్రి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తపాలా శాఖా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి వారధిగా ఉంటుందని తెలిపారు. హిందూ సంప్రదాయాలు, దేవాలయాల పేరుతో పోస్ట్కార్డులు ముద్రించడం చాలా సంతోషమన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల వలె ఏపీలో ఉన్న దేవాలయాలకు కూడా పోస్టల్ సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఒకేసారి వర్చ్యువల్గా పంచరామాలు దర్శించడం సంతోషమని తెలిపారు. మహాత్ముల గురించి తెలుసుకోవడం యువతకు చాలా అవసరమని చెప్పారు.