ఆ తరువాతే చంద్రబాబు విశాఖలో అడుగు పెట్టాలి

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పిన తర్వాతే విశాఖలో అడుగు పెట్టాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండు చేశారు.  అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు సంఘీభావం తెలపాలని సూచించారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే చంద్రబాబుకు అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు.విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను నష్టం కలిగించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.
 

Back to Top