నేడు బత్తల­పల్లి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర   

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర ఇవాళ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. బత్తల­పల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్‌పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు.
పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు
అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్‌.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు.

Back to Top