టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లు హాస్యాస్ప‌దం

శ్రీకాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ కిల్లి కృపారాణి
 

 శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నెల రోజుల పాలనపై ప్రతిపక్ష టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని శ్రీకాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ కిల్లి కృపారాణి అన్నారు. గత ప్రభుత్వ పాలనలోని అవినీతి వెలికి తీసి, అక్రమ నిర్మణాలపై చర్యలు తీసుకుంటే దానిని కక్ష సాధింపు చర్య అని ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ..  అవినీతి రహిత, పారదర్శక, సామాజిక విప్లవం తెచ్చే పాలన చేస్తున్న ఏపీ సీఎం. జగన్ను అభినందించాలని అన్నారు. 

Back to Top