విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు సంబంధించి కృష్ణా జిల్లాలో ఫ్యాను హవా కొనసాగుతోంది. 46 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలు ఇంకా బోణీ కొట్టలేదు. 723 ఎంపీటీసీ స్థానాలకు గాను(ఏకగ్రీవాలతో కలిపి)ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైఎస్సార్సీపీ 449 స్థానాల్లో గెలుపు సాధించి అగ్రభాగాన నిలవగా టీడీపీ 10 స్థానాలు దక్కించుకుంది.