కోవిడ్ మృతుల‌ అంత్యక్రియలకు రూ.15వేలు సాయం

 అమరావతి: కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు సాయం అందించనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్‌ కారణంగా మరణించే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసింది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 94,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24,171 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,35,491 మందికి కరోనా వైరస్‌ సోకింది. మొత్తం మరణాల సంఖ్య 9,372కు చేరింది. గడిచిన 24 గంటల్లో 21,101 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 12 లక్షల 15 వేల 683 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య శాఖ తెలిపింది.
 

తాజా వీడియోలు

Back to Top